twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జల్సా విజయోత్సవం

    By Staff
    |

    Pawan Kalyan
    డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ లలో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్న సినిమా 'జల్సా'. పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా రూపొందిన ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం నాగబాబు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. చిరంజీవి సేవాదళ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఫ్యాన్స్‌ బాణ సంచా కాల్చి మరీ ఎంజాయ్ చేసారు. చిత్రాన్ని హిట్‌ చేసిన ప్రేక్షకులకు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు.

    నిర్మాతలు కమర్షియల్‌ ధోరణిలో మాత్రమే కాకుండా సామాజిక సేవా లక్ష్యంగా సినిమాలు తీయాలని నాగబాబు కోరారు. క్లుప్తంగా ప్రసంగం ముగించిన నాగబాబు, మరో సినిమా విజయోత్సవ వేడుకల్లో కలుసుకుందామని అభిమానులకు తెలిపారు. ఆ తర్వాత నాగబాబు కడపలోని పెద్ద దర్గా అమీన్‌పూర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడపలో కూడా నాగబాబుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. మెగాస్టార్‌ రాజకీయ ప్రవేశంపై వార్తలొస్తున్న తరుణంలో నాగబాబు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X