Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బుల్లితెరపై నాగబాబు పని ఖతం!.. ఇకపై అక్కడే మెగా బ్రదర్ రచ్చ
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వెండితెరపై నిర్మాతగా నటుడిగా తన సత్తాను చాటుకున్నాడు. అయితే మెగా బ్రదర్ స్థాయిలో నిర్మాతగా, నటుడిగా తగినంత గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. నిర్మాతగా జాతీయస్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టిన చిత్రాలను నిర్మించాడు. నటనతో అందరినీ ఏడిపించేశాడు. కానీ ఆరెంజ్ లాంటి చిత్రంతో నాగబాబు మొత్తం మునిగిపోయాడు. అలా వెండితెర నుంచి బుల్లితెరకు పడిపోయాడు.
ఆరెంజ్ నష్టాలు..
నాగబాబు నిర్మించిన ఆరెంజ్ సినిమా ఎంతలా నష్టాలను తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. అనుకున్న దానికంటే ఎక్కువగా బడ్జెట్ పెరగడం, ఎక్కువగా నష్టాలను మిగల్చడంతో నాగబాబు పరిస్థితి తారుమారైంది. ఆరెంజ్ కష్టాలను, నష్టాలను తీర్చేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కదిలి వచ్చారు.
బుల్లితెరపై మెల్లిగా..
ఆరెంజ్ తరువాత నాగబాబు సినిమాలను తీయడమే ఆపేశాడు. అలా వెండితెరను వదిలేసి బుల్లితెరపై మళ్లీ కెరీర్ కొత్తగా ప్రారంభించాడు నాగబాబు. సీరియల్స్లో నటిస్తూ.. సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ మెల్లిగా తన ఆదాయాన్ని పెంచుకున్నాడు.
కామెడీ షోలకు జడ్జ్గా..
ఇక సీరియల్స్తో పాటు కామెడీ షోలకు జడ్జ్లుగా వ్యవహరించడం ప్రారంభించాడు. అదుర్స్ అంటూ వచ్చినషోలో నాగబాబు బాగానే క్లిక్ అయ్యాడు. అలా జబర్దస్త్ షోలోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి నాగబాబు కెరీర్ పూర్తిగా మారిపోయింది. దాదాపు ఆరేళ్ల అనుబంధంతో జబర్దస్త్తో ఉంది.
అదిరిందిలోకి.
దాదాపు ఆరేళ్ల జబర్దస్త్ అనుబంధాన్ని కాదనుకుని.. అదిరింది అంటూ జీ తెలుగులో కొత్త షోను ప్రారంభించారు. అది కొన్ని వారాలు బాగానే నడిచింది. అదిరిందిని బొమ్మ అదిరిందిగా మార్చారు. కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు. దెబ్బకు మూలన పడింది. ఆ షో ఛాయలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు.
గుడ్ బై చెప్పేశాడా?
అయితే ఇప్పుడు బుల్లితెరపై నాగబాబు కనిపించడం లేదు.తన ఫోకస్ మొత్తం తన యూట్యూబ్ చానెల్ మీద పెట్టేశాడు. అందుకే అదిరింది టీంను స్టార్ మాలోని కామెడీ స్టార్స్ అనే కొత్త షోకి వెళ్లినా అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. గల్లీబాయ్స్, చమ్మక్ చంద్ర వంటి వారంతా కూడా స్టార్ మా కామెడీ స్టార్స్ కొత్త షోలో కనిపించారు. నాగబాబు మాత్రం ఇక బుల్లితెరకు వీడ్కోలు చెప్పి తన యూట్యూబ్ చానెల్ స్టాండప్ కామెడీని నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.