Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
'పంజా'ఫంక్షన్ కి ఎందుకెళ్లలేదంటే...నాగబాబు
సినిమా రైటర్స్ కన్నా మీ ఛానెల్ బాగా కథలు అల్లారంటూ తనను ప్రశ్నించిన ఛానెల్ తో నాగబాబు అన్నారు.పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా ఆడియో పంక్షన్ కి మెగా కుటుంబం హాజరు కాకపోవటంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు చెలరేగాయి.వాటిని బేస్ చేసుకుని మీడియాతో రకరకాల కధనాలు ప్రచారం అవుతున్నాయి.వీటిని తొలిగించటానికి ఓ పాపులర్ న్యూస్ ఛానెల్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో మాట్లాడి,విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.
కళ్యాణ్ బాబు ఆడియో ఫంక్షన్ కి వెళ్లకపోవటానికి మాకు తెలిసింది..చిరంజీవిగారికి ఓ అపాయింట్ మెంట్ ఉండి రాలేని పొజీషన్ లో ఉన్నారు.ఇక చరణ్ బాబు చైనాలో రచ్చ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.బన్నీ,వినాయిక్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు.నాకు హెల్త్ బాగోలేదు.ఈ ఒక్క సంఘటన తీసుకుని మీరు కుటుంబ సభ్యుల మనస్పర్దలు అంటూ ప్రసారం చేస్తున్నారు.దీనివల్ల వచ్చే ప్లాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ కు డిజప్పాయింట్ మెంట్ అయ్యే సమస్య ఉంది అన్నారు.
దానికి ఛానెల్ వారు అభిమానులకు ఆందోళన కలగకూడదనే ఉద్దేశ్యంతోనే మీ నుంచి డైరక్ట్ గా వివరణ తీసుకుంటున్నాము అన్నారు.అలాగే నాగబాబు వారసత్వం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దని,దానినుంచి సరైన అర్దం తీసుకోవాలని అన్నారు.అలాగే మీరు ఇంతకుముందు చిరంజీవిగారికీ,నాకు విభేదాలు ఉన్నాయని ప్రసారం చేసారు.దీంతో మా అభిమానులు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి అన్నారు.