Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్వీట్ డిలీట్ చేసిన మెగా బ్రదర్.. బాలయ్య ‘శివ శంకరి’పై నాగబాబు సెటైర్స్
నందమూరి బాలకృష్ణ, మెగా బ్రదర్ నాగబాబు మధ్య కోల్డ్ వార్ ముగిసేది కాదు. బాలకృష్ణ అయితే పని గట్టుకుని మరీ కామెంట్స్ చేయడు గానీ.. నాగబాబు మాత్రం టార్గెట్ చేస్తూనే ఉంటాడు. అయితే బాలయ్య బాబు చేసే కామెంట్స్కు నాగబాబు చురకలు వేస్తుంటాడు. ఆ మధ్య బాలయ్య అంటే నాటి తరం కమెడియన్ కదా అంటూ పేర్కొనడం అప్పట్లో పెను దుమారాన్ని లేపింది. మళ్లీ గత వారం నుంచి వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
బాలయ్య వ్యాఖ్యలు వైరల్..
సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు, అలాగే ముఖ్యమంత్రులతో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్న విషయం తనకు తెలియదని బాలయ్య కామెంట్స్ చేశాడు. భూములు పంచుకునేందుకు మీటింగ్లు పెట్టుకుంటున్నారని అనడంతో వివాదం మొదలైంది.
క్షమాపణ చెప్పాల్సిందే..
భూములు పంచుకోవడానికి అని చెప్పి.. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు నాగబాబు ఫైర్ అయ్యాడు. ముందుగా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని, నోరు అదుపులో పెట్టుకోమని, ఇండస్ట్రీకి నువ్వేమీ కింగ్ వి కాదని, జస్ట్ ఓ హీరోవేనని ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సద్దుమణిగట్టే అనిపించింది
అయితే ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినట్టే అనిపించింది. తానేమీ కామెంట్ చేయనని, ఇండస్ట్రీ మొత్తం తనవైపే ఉందని, ఆయనే ఏదో అనుకుంటున్నాడని నాగబాబు గురించి బాలయ్య కామెంట్ చేశాడు. ఆయన హీరో.. ఆయన స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని నాగబాబు సైతం కామెంట్స్ చేశాడు. ఆయనంటే ఎల్లప్పుడూ గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు.
బాలయ్య శివశంకరీ..
నాటి క్లాసిక్ సాంగ్ శివశంకరీ పాటను బాలయ్య పాడాడు. ఇక ఈ పాట ఎంతగా విమర్శల పాలైందో అందరికీ తెలిసిందే. న్టీఆర్ నటించిన జగదేకవీరునికథలోని ఆ పాటను ఘంటసాల అద్భుతంగా పాడారు. అయితే బాలయ్య ఆ పాటను కూనీ చేశారని ఓ వర్గం నానా హంగామా చేస్తోంది. ఇప్పటికే వర్మ ఓ రేంజ్లో ఆడుకుంటున్నాడు. తాజాగా నాగబాబు కూడా జత కలిశాడు.
ట్వీట్ డిలీట్..
నాగబాబు బాలయ్యయ శివ శంకరీ పాటను ఉద్దేశిస్తూ..‘కరోనా జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం సర్క్యూలేట్ అవుతుందిరా.. అయ్యా జాగ్రత్తరా అయ్యా.. దండం పెడతాను.. అయ్యబాబోయ్ చిన్న పిల్లలని, ముసలి వాళ్లను.. హెల్త్ బాగాలేని వాళ్లని, సంగీతం వినకుండా చూసుకోండి. విన్నారంటే ఏదైనా జరగొచ్చు.. అయినా ఏందయ్యా ఇది.. ఇది నేను చూల్లే.. ఎక్కడ ఇనలే..' అని ఓ రేంజ్లో కించపరిచాడు. అయితే ఏమనుకున్నాడో ఏమో గానీ ఆ ట్వీట్ డిలీట్ చేసి కొత్త ట్వీట్ వేశాడు.
ఘంటసాల గాత్ర మాధుర్యం..
అయితే అంతటి పదునైన విమర్శణ సరికాదని అనుకున్నాడేమో గానీ తాజాగా స్పందిస్తూ.. ‘ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా originals చాలా అద్భుతంగా ఉంటాయి.ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికె తెలిసుంటది' అని ట్వీట్ చేశాడు.