Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అదంతా నా వ్యక్తిగతం.. ఎవ్వరితోనూ సంబంధం లేదు.. మరో వివరణ ఇచ్చిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు నాథురాం గాడ్సేపై చేసిన ట్వీట్ చినికి చినికి గాలి వానగా మారేట్టు కనిపిస్తోంది. గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు చేసిన ఈ ట్వీట్లో ఆయన్ను ఓ దేశ భక్తుడిగా కీర్తించడం అభ్యంతరకంగా మారింది. ఇక ఈ ట్వీట్పై రాజకీయ నాయకులు భగ్గుమన్నారు. పలువురు నాగబాబుపై ఫైర్ కాగా కొంతమంది.. కేసులు కూడా పెట్టారు. అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, చిరంజీవికి ఆపాదించి విమర్శిస్తున్నారు. అలాంటి కామెంట్లపై స్పందిస్తూ.. నాగబాబు వివరణ ఇచ్చాడు. అసలింతకీ నాగబాబు చేసిన ట్వీట్స్ ఏంటి? ఎందుకు ఈ గొడవ జరుగుతోందో ఓ సారి చూద్దాం.
కాంట్రవర్సీకి తెరదీసిన ట్వీట్..
నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.. ‘ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని చెప్పారు.
ఆయన దేశభక్తిని శంకించలేం...
'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'అని పేర్కొన్నాడు.
నాగబాబు వివరణ...
ఈ ట్వీట్లపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నాగబాబు వివరణ ఇచ్చుకున్నాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే నాకు చాలా గౌరవం. వాస్తవానికి నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవమ'ని చెప్పుకొచ్చాడు.
Recommended Video
మెగా బ్రదర్ మరో వివరణ..
గాడ్సేపై నాగబాబు చేసిన ట్వీట్పై వ్యక్తిగత దూషణలు, కుటుంబం వరకు వెళ్లడంతో నాగబాబు మరో వివరణ ఇచ్చుకున్నాడు. ‘నేను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ నా అభిప్రాయాలతో ఎటువంటి ప్రమేయమూ లేద'ని చెప్పుకొచ్చాడు.