Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరి దర్శకత్వంలో మెగా ఫ్యామిలి నుండి వరుణ్ తేజ్..
ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ అనే తేజం తెలుగు తెరపై వెలుగులు విరజిమ్ముతోంది. ధరమ్ తేజ్ అనే మరో తేజం వెలుగులు విరజిమ్మేందుకు రాత్రి పగలు కష్టపడుతోంది. ఇక పోతే..మరో తేజం కూడా తెలుగు సినీ వినీలాకాశంలో వెలుగులు విరబూసేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. చిరంజీవి అక్క కొడుకు ధరమ్ తేజ్ వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రేయ్" చిత్రం ద్వారా త్వరలో రంగప్రేవేశం చేయనుండడం తెలిసిందే.
కాగా, మెగా ఫ్యామిలీ నుండి మరో తేజం తెలుగు తెరంగేట్రం చేసేందుకు తహతహలాడిపోతూ..అందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల్లో మునిగితేలుతోంది. చిరంజీవి సోదరుడు, నటుడు, నిర్మాత అయిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో హీరోగా రంగప్రవేశం చేయించేందుకు ఏర్సాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో వరుణ్ తేజ్ హీరోగా సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని, ఈ చిత్రానికి నాగబాబుకు అత్యంత ఆత్మీయమిత్రుడు శ్రేయోభిలాషి అయిన పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.