Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'కేడి'లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే..నాగార్జున
"ఈ చిత్రంలో నాది మనుషుల్ని మాయచేసే పాత్ర. పలు షేడ్స్తో కొత్తగా ఉంటుంది. పాత్ర ప్రకారం 'కేడి' అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్. కథనం కొత్త తరహాలో ఉంటుంది. గాంబ్లింగ్, కార్ల దొంగతనాలు నేపథ్యంలో కథ నడుస్తుంది. ఎంటర్టైనింగ్గా ప్రారంభమయ్యే ఈ సినిమా క్రమంగా సీరియస్ తరహాలోకి మళ్లుతుంది అంటున్నారు నాగార్జున.నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళామూవీస్ పతాకంపై 'కేడి' చిత్రాన్ని డి.శివప్రసాద్రెడ్డి నిర్మిస్తున్నారు. మమతా మోహన్దాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.
ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం విశేషాలు చెప్పుకొచ్చారు. మా కేడీ చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రొమాన్స్ కూడా ఉంది. దర్శకుడు కిరణ్ మంచి ప్రతిభావంతుడు. ఈ సినిమాని బాగా తీస్తున్నాడు. సందీప్చౌతా సంగీతం ఈ సినిమాకి ప్లస్. నిర్మాతగా రజతోత్సవ సంవత్సరంలో ఉన్న శివప్రసాద్రెడ్డి చక్కని విలువలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు'' అని చెప్పారు.
అలాగే నేను ఈ చిత్రంలో మోసాలు చేస్తూ..అనేక గెటప్ లు వేస్తూంటాను. ఇది ఓ ప్రత్యేకమైన నావెల్ క్యారక్టైజేషన్. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ప్రెష్ గా ఫీలవటం గ్యారెంటీ. అలాగే ఫైనల్ రషెష్ చూసాక నేనూ ఫ్రెష్ గా ఫీలయ్యాను.. నా ఇంటెన్షన్ ఏమిటంటే ప్రేక్షకుడుకి ఓ డిఫెరెంట్ లుక్ తో ఫ్రెష్ గా ఫీలయ్యేలా చేయాలని అంటూ నాగార్జున తన కేడీ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో గాంబ్లింగ్, కార్డ్స్ ఆడటం ఉంటాయి. కానీ అవి హీరోకి హాబీలే. అంతే తప్ప అదే కథ కాదు అని నాగార్జున వివరణ ఇచ్చారు.
ఇక నిర్మాత శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ "ఈ రజతోత్సవ సంవత్సరంలో నాగార్జునతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వస్తోంది. ఈ నెల 25న ఆడియోని విడుదల చేసి, సంక్రాంతి కానుకగా, జనవరి రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. ఇక దర్శకుడు కిరణ్ గతంలో నాగార్జున నిర్మించిన యువ సీరియల్ కు మాటలు అందించాడు. అలాగే ఈ చిత్రంలో ఆస్కార్ విన్నింగ్ స్లమ్ డాగ్ మిలియనీర్ లో విలన్ గా చేసిన అంకుర్ విలన్ గా చేస్తున్నాడు. అంకుర్ ఈ చిత్రంలో చంద్ర అనే పాత్ర చేస్తున్నాడు. గుంటూరు నుంచి గోవా వెళ్లి చివరకు హైదరాబాద్ చేరుకునే పాత్ర అది.