Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎక్కడో ఒకచోట తలదించుకోవాల్సి వస్తోంది : నాగార్జున
హైదరాబాద్ : కమర్షియల్ సినిమా... అనే మాటకు ఇప్పుడు అర్థం మారిపోయింది. ఆ పేరుతో వచ్చే చిత్రాల్లో చాలా వరకు కుటుంబంతో కలిసి చూసేలా ఉండడం లేదు. మధ్యలో ఎక్కడో ఒకచోట తలదించుకోవాల్సి వస్తోంది. అందుకు భిన్నంగా తెరకెక్కిన చిత్రం 'డమరుకం'. ఇందులో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి కానీ... అక్కాచెల్లెళ్ల దగ్గర నుంచి అమ్మమ్మల వరకు అందరితోనూ కలిసి హాయిగా చూడొచ్చు. పాటలు, సంభాషణలు, సన్నివేశాలు... ఎక్కడా అసభ్యత కనిపించదు. అదే ఈ సినిమా ప్రత్యేకత అంటున్నారు నాగార్జున.
'శిరిడిసాయి'గా ఇటీవల ప్రేక్షకుల్ని భక్తిసాగరంలో ముంచెత్తిన నాగార్జున... మరోసారి మాస్ అవతారం ఎత్తాను అంటున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'డమరుకం'. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే 'డమరుకం' చిత్రం శివుడు, రాక్షసుడు, మనిషి... ఈ ముగ్గురి మధ్య సాగే కథ ఇది అంటున్నారు. శివుడి కథ అంటున్నామని ఇదేదో దేవుడి సినిమా అనుకోవద్దు అని తేల్చి చెప్పారు.
'డమరుకం' లో తన పాత్ర గురించి చెపుతూ...'చూడ్డానికి క్లాస్గా కనిపిస్తున్నాను కానీ... నేను చాలా మాస్' అంటూ సాగే సంభాషణలు ఇందులో ఉంటాయి. దాన్నిబట్టి ఈ చిత్రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ స్క్రీన్పై ముందెన్నడూ చూడని విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్తో ఈ చిత్రం తెరకెక్కుతోందని, శ్రీనివాసరెడ్డి వెండితెర వండర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిపారు. అనూష్క కాంబినేషన్ లో మరో సారి చేస్తున్న ఈ చిత్రంతో తాను గ్యారెంటీగా హిట్ కొడతానని నమ్మకం వ్యక్తం చేసారు.
ఈ సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుంది. 'యమగోల', 'జగదేకవీరుడు అతిలోకసుందరి, 'యమదొంగ' తదితర చిత్రాలు ప్రేక్షకుల్ని ఎలాంటి అనుభూతికి గురిచేశాయో అలా ఉంటుంది ఈ చిత్రం అని చెప్పబడుతున్న ఈ చిత్రంలో గిరిబాబు, ప్రకాష్రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, జీవా, రఘుబాబు, ఎమ్మెస్నారాయణ, కృష్ణభగవాన్, బ్రహ్మాజీ, గీతాంజలి, కవిత, రజిత, సత్యకృష్ణన్ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, సహనిర్మాత: వి.సురేష్రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.