Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రచారం జరుగుతోంది, అది నిజం కాదు: నాగార్జున
హైదరాబాద్ : వచ్చే ఏడాది తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగచైతన్యతో కలిసి తను నటించే సినిమా అన్నపూర్ణ స్టూడియో బేనరుపై మొదలవుతుందని నాగార్జున తెలిపారు. ' ఈ సినిమాకి 'త్రయం' అనే టైటి ల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ఆ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. '13బి', 'ఇష్క్' చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రంకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు' అని నాగార్జున.
అలాగే 'భాయ్' చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనరుపై నాగార్జున స్వయంగా నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ...'వీరభద్రం చెప్పిన కథ బాగా నచ్చింది. మాఫియా నేపథ్యంలో నడిచే చక్కని మాస్ ఎంటర్టైనర్. 'హలో బ్రదర్' సినిమాలో ఎంత వినోదం ఉందో అంత వినోదం 'భాయ్' సినిమాలోనూ ఉంటుంది' అని చెప్పారు నాగార్జున. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో 'లవ్స్టోరీ' చిత్రంలో నటిస్తున్న అక్కినేని నాగార్జున అది పూర్తయిన వెంటనే 'భాయ్' అనే సినిమా చేయబోతున్నారు. 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' వంటి వరుస హిట్లతో అందరి దృష్టినీ ఆకట్టుకున్న వీరభద్రం చౌదరి ఈ సినిమాకి దర్శకుడు.
అలాగే అలాగే బెల్లంకొండ సురేష్ నిర్మించే సినిమాలో కూడా నటించనున్నానని నాగార్జున తెలిపారు. ఇక నాగార్జున, అనుష్క జంటగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం'. ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. కె. అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తయైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ... "చందమామ, అమరచిత్రకథల తరహాలో ఉండే కథ 'డమరుకం'. కథ చాలా బాగుంటుంది. ప్రేక్షకులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ కారణంగానే ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. ఈ విషయంలో నిర్మాత వెంకట్ ఏ మాత్రం రాజీ పడకుండా గొప్పగా గ్రాఫిక్స్ చేయించారు. సెప్టెంబర్లో ఆడియో, అక్టోబర్లో సినిమా విడుదలవుతాయి. నాకు ఇది తొలి సోషియో ఫాంటసీ. పైగా నాకు తెలిసి తెలుగులో ఈ తరహా సినిమా ఎవరూ చేయలేదు'' అని నాగార్జున చెప్పారు.