Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ గోపాల్ వర్మ, అఖిల్ సినిమా గురించి నాగార్జున!
అక్కినేని వారబ్బాయి అఖిల్ నటించిన తొలి రెండు సినిమాలు అఖిల్, హలో. తాజాగా ఈ హీరో తొలిప్రేమ దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. మూడో సినిమాతోనైనా భారీ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు అక్కినేని అఖిల్.
వెంకి అట్లూరి, అఖిల్ సినిమాకు 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటిస్తోంది. రెండో సినిమా కూడా అక్కినేని ఫ్యామిలి హీరోతో చెయ్యడం విశేషం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
దర్శకుడు వెంకి అట్లూరి సినిమా తరువాత అఖిల్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. వర్మ స్వయంగా ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ... ''అఖిల్, వర్మ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయని చెప్పడం జరిగింది''.