Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగ్ కు ఖరీదైన గుణపాఠం
హైదరాబాద్ : 'మనం' కాదు... 'భాయ్'తోనే నాలో మార్పు మొదలైంది. ఎలాంటి కథలు చేయాలో, ఎలాంటి కథలు చేయకూడదో ఆ ఫలితమే తేల్చి చెప్పింది. 'భాయ్' విషయంలో నేనెవ్వరినీ నిందించడం లేదు. తప్పంతా నాదే. ఎందుకంటే నా నిర్ణయం మేరకే ఆ సినిమా పట్టాలెక్కింది. అయితే ఆ అనుభవం ఖరీదైన గుణపాఠంగా మిగిలిపోయింది అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. శుక్రవారం నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఇలా చెప్పుకొచ్చారు.
'మనం', 'దృశ్యం'లాంటి సినిమాలు చూస్తుంటే.. పరిశ్రమ మరో మలుపు తీసుకొన్నట్టే అనిపిస్తోంది.. అదంతా స్క్రిప్ట్ల ప్రభావం. కేవలం కథలే ఈ సినిమాల్ని నడిపించాయి. మంచి కథలొస్తే మాలాంటి కథానాయకులు ఇమేజ్ని పక్కన పెట్టి నటించడానికి సిద్ధమవుతాం. 'దృశ్యం' చూశా. చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ చూడండి. అందులో వెంకటేష్ దెబ్బలు కూడా తింటాడు. నిజానికి అలాంటి సన్నివేశాలు తెలుగు సినిమాల్లో చూడడం కష్టం. హీరో దెబ్బలు తినడం ఏంటి అంటారు అన్నారు.
తండ్రిని తలుచుకుంటూ...అయితే ఈ యేడు ఎప్పటికీ మర్చిపోలేను. యేడాది ప్రారంభంలోనే నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ 'మనం'లాంటి ఓ మధురమైన కానుక ఇచ్చారాయన. ప్రతి పుట్టిన రోజూ అభిమానుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవడం అలవాటు. అయితే ఈ యేడాది సంబరాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకొన్నా అన్నారు.
'ఒక లైలా కోసం' గురించి మాట్డాలుడుతూ...ఆ చిత్రం ఇప్పటికే చూశా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. మంచి సమయం తీసుకొని విడుదల చేస్తాం. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు. సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యమే. 'మనం'కోసం రెండు నెలలు ఆగాం. మంచి సినిమా తీశాం. విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు అన్నారు.