Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగార్జున చాలా హింస చేస్తున్నాడు: నిత్యప్రియురాలు..!?
నాగార్జున సినిమాల్లో హింస ఎక్కువైపోతోంది". ఈ మాటలు అన్నది ఎవరో కాదు. నాగర్జున మెచ్చిన నిత్యప్రియురాలైన భార్యామణి అమల. సెంట్రల్ ఏనిమల్ వెల్ ఫేర్ బోర్డ్ లో మెంబర్ అయిన అమల నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'హింస అనేది మన జీవితంలో నిత్యకృత్యమైపోయింది. న్యూస్ పేపర్స్ లో, టి.వి ఛానల్స్ లో ప్రతి రోజూ, ప్రతి గంట దాని గురించే చెప్పిందే పదే పదే చెప్పి మనుషుల్లో హింసా ప్రవృత్తిని మరింత పెంచుతున్నారు. రేప్, హత్య, యాక్సిడెంట్..అన్ని వార్తలనూ హైలైట్ చేస్తున్నారు. సినిమాల్లో కూడా హింస బాగా చూపిస్తున్నారు. నాగార్జున సినిమాల్లో సైతం హింస బాగా పెరిగిపోయింది.
మనల్ని ఇంప్రెస్ చేసేది ఒక హింసేనా? ఇంకేమీ లేదా? ఇప్పడు మనుషుల్లో అలజడి, ఆందోళన, భయం..ఇవన్నీ బాగా పెరిగిపోవడానికి టీవిల్లోగానీ, సినిమాల్లో గాని చూపించే హింస ఒక కారణంగా నేను భావిస్తున్నాను. మనసు ప్రశాంతంగా వుండాలంటే ఈ రోజు నుంచే జంతువుల్ని ప్రేమిద్దాం మనస్పూర్తిగా వాటికి అందించే ప్రేమ ద్వారా మనకి ప్రశాంతత కలుగుతుంది. తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుంది" అన్నారు.