Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగార్జున.... జీసస్ అవతారం?
హైదరాబాద్: అన్నమయ్యగా....శ్రీరామదాసుగా....షిరిడి సాయిగా.....భక్తిరస చిత్రాలతో అలరించిన కింగ్ నాగార్జున మరో భక్తిరస చిత్రం చేయడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఆయన ఈ సారి చేయబోయే చిత్రం మాత్రం విభిన్నం. త్వరలో నాగార్జున ఏసు ప్రభువుగా వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్నట్ల తెలుస్తోంది.
అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయిబాబా వంటి భక్తి చిత్రాలు నాగార్జున కెరీర్లోనే చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు. ఈ మూడు చిత్రాలకు దర్శకత్వం వహించింది రాఘవేంద్రరావే కావడం గమనార్హం. ఈ సారి నాగార్జునను జీసెస్ పాత్రలో చూపించడానికి రాఘవేంద్రరావు ప్లాన్ చేసుకుంటున్నాడని వినికిడి.
ఇప్పటికే రాఘవేంద్రరావు స్క్రిప్టు వర్కు కూడా పూర్తి చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు మాటను నాగార్జున కాదనే అవకాశం లేదని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ప్రస్తుతం నాగార్జున తన కొడుకు అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న సినిమా పనులు దగ్గరుండి చేసుకుంటున్నారు. అఖిల్ తొలి సినిమా నిర్లక్ష్యం చేస్తే అతని కెరీర్ పై దెబ్బపడే అవకాశం ఉండటంతో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తూండగా, నాగార్జున-నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.