Just In
Don't Miss!
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- Finance
పెట్రోల్ ధరలు తగ్గుతాయా, బడ్జెట్లో నిర్మలమ్మ గుడ్న్యూస్!
- News
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగార్జున.... జీసస్ అవతారం?
హైదరాబాద్: అన్నమయ్యగా....శ్రీరామదాసుగా....షిరిడి సాయిగా.....భక్తిరస చిత్రాలతో అలరించిన కింగ్ నాగార్జున మరో భక్తిరస చిత్రం చేయడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఆయన ఈ సారి చేయబోయే చిత్రం మాత్రం విభిన్నం. త్వరలో నాగార్జున ఏసు ప్రభువుగా వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్నట్ల తెలుస్తోంది.
అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయిబాబా వంటి భక్తి చిత్రాలు నాగార్జున కెరీర్లోనే చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు. ఈ మూడు చిత్రాలకు దర్శకత్వం వహించింది రాఘవేంద్రరావే కావడం గమనార్హం. ఈ సారి నాగార్జునను జీసెస్ పాత్రలో చూపించడానికి రాఘవేంద్రరావు ప్లాన్ చేసుకుంటున్నాడని వినికిడి.

ఇప్పటికే రాఘవేంద్రరావు స్క్రిప్టు వర్కు కూడా పూర్తి చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు మాటను నాగార్జున కాదనే అవకాశం లేదని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ప్రస్తుతం నాగార్జున తన కొడుకు అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న సినిమా పనులు దగ్గరుండి చేసుకుంటున్నారు. అఖిల్ తొలి సినిమా నిర్లక్ష్యం చేస్తే అతని కెరీర్ పై దెబ్బపడే అవకాశం ఉండటంతో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తూండగా, నాగార్జున-నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.