Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జునతో రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర
హైదరాబాద్ : 'శిరిడిసాయి' చిత్రంలో రామకృష్ణ పరమహంసగా నాగార్జున కనిపిస్తారు. అవకాశమొస్తే నాగార్జునతో రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను సినిమాగా తీస్తాను '' అన్నారు 'శిరిడిసాయి' నిర్మాత మహేష్ రెడ్డి. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్రెడ్డి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే చిత్రం 'శిరిడిసాయి' తాము అనుకున్నట్లుగానే విజయం సాధించిందని,ఈ చిత్రాన్ని హిందీతోపాటు తమిళ, మరాఠీ భాషల్లోకి అనువదించబోతున్నామని అన్నారు.
మహేష్ రెడ్డి మాట్లాడుతూ...''బాబా తత్వాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే 'శిరిడిసాయి' తీశాం. మా లక్ష్యం నెరవేరడం ఎంతో ఆనందాన్నిచ్చింది. చిత్రాన్ని హిందీతోపాటు తమిళ, మరాఠీ భాషల్లోకి అనువదించబోతున్నాము. మరిన్ని జాగ్రత్తలు తీసుకొని చిత్రాన్ని అనువదించాలనుకొంటున్నాం. ఎలాంటి వాణిజ్యపరమైన ఆలోచనలు లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించాను. కానీ విడుదలకు ముందు రోజే... మేం పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చింది'' అని చెప్పారు.
అలాగే ''మా సినిమాని చూసి కనీసం వెయ్యిమంది భక్తులు శిరిడికి వెళ్లి బాబాను దర్శించుకొన్నా చాలనుకొన్నాను. 'శిరిడిసాయి'తో ఆ లక్ష్యం నెరవేరడం ఎంతో తృప్తినిచ్చింది. ఇప్పటి వరకూ యాభై లక్షలమందికిపైగా చిత్రాన్ని చూశారు. చిత్ర ప్రారంభంలో వచ్చే అభిషేకం పాటతోనే ప్రేక్షకుల్ని కథలో లీనం చేశారు దర్శకులు కె.రాఘవేంద్రరావు. నాగార్జున సినీ జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది'' అన్నారు. 'శిరిడిసాయి'లో నాగార్జున బాబా పాత్ర పోషించిన సంగతి విదితమే.