'జోష్'లో నాగ్, బాలయ్య, వెంకీ?

By Staff

నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమౌతున్న చిత్రం 'జోష్'. ఒకప్పటి ప్రముఖ నాయిక రాధ కుమార్తె కార్తిక కథానాయికగా పరిచయమౌతోంది. 'దిల్'రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి సంభందించిన ఓ తాజా వార్త అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రముఖ కథానాయకులు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు తలుక్కున మెరవనున్నారు. వీరంతా ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపిస్తారని సమాచారం. ఇంకా అక్కినేని నాగేశ్వర రావు, డి.రామానాయుడు కూడా ఈ జాబితాలో వున్నట్టు సమాచారం.

ఇప్పటికే కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రానికి ఈ అప్పీరియన్స్ మరింత క్రేజ్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X