twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జోష్'లో నాగ్, బాలయ్య, వెంకీ?

    By Staff
    |

    నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమౌతున్న చిత్రం 'జోష్'. ఒకప్పటి ప్రముఖ నాయిక రాధ కుమార్తె కార్తిక కథానాయికగా పరిచయమౌతోంది. 'దిల్'రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ చిత్రానికి సంభందించిన ఓ తాజా వార్త అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రముఖ కథానాయకులు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు తలుక్కున మెరవనున్నారు. వీరంతా ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపిస్తారని సమాచారం. ఇంకా అక్కినేని నాగేశ్వర రావు, డి.రామానాయుడు కూడా ఈ జాబితాలో వున్నట్టు సమాచారం.

    ఇప్పటికే కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రానికి ఈ అప్పీరియన్స్ మరింత క్రేజ్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X