twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘భాయ్’ దసరాకి షురూ...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కింగ్ నాగార్జున త్వరలో నటించబోయే 'భాయ్' చిత్రం ప్రారంభోత్సవ ముహూర్థం ఖరారైంది. దసరా పండగ(అక్టోబర్ 24)న సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ ఇందులో కథానాయిక.

    ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుందన్నారు. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని వీరభద్రం చౌదరి తెలిపారు.

    నా గత రెండు చిత్రాలకంటే అద్భుతంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఆయన మాటలను బట్టి అహ నా పెళ్లంట, పూలరంగడు చిత్రాలను మించిన ఎంటర్ టైన్మెంట్ ఈచిత్రంలో మనకు లభిస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.

    ప్రస్తుతం నాగార్జున నటించిన శిరిడి సాయి ఇప్పటికే విడుదలైన సాయి భక్తులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు ఆయన నటించిన 'డమరుకం' చిత్రం అక్టోబర్ 11న విడుదలకు సిద్దం అవుతోంది. శిరిడి సాయి చిత్రం శిరిడి సాయిబాబా చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందింది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'డమరుకం'. ఈచిత్రంలో నాగార్జున సరసన అనుష్క రొమాన్స్ చేస్తోంది.

    English summary
    Akkineni Nagarjuna's forthcoming action entertainer Bhai is expected to be launched on the auspicious day of Dussera. Richa Gangopadhyay will be playing the female lead in this film, which will showcase Nagarjuna in a new avatar. Director Veerabhadram said that he has completed writing the script.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X