Don't Miss!
- News పవన్ కల్యాణ్ అఫిడవిట్లో ఏముంది?
- Sports చరిత్ర సృష్టించిన జైస్వాల్.. కోహ్లి సరసన!
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
నాగార్జున ‘భాయ్’ దసరాకి షురూ...
హైదరాబాద్: కింగ్ నాగార్జున త్వరలో నటించబోయే 'భాయ్' చిత్రం ప్రారంభోత్సవ ముహూర్థం ఖరారైంది. దసరా పండగ(అక్టోబర్ 24)న సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ ఇందులో కథానాయిక.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుందన్నారు. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని వీరభద్రం చౌదరి తెలిపారు.
నా గత రెండు చిత్రాలకంటే అద్భుతంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఆయన మాటలను బట్టి అహ నా పెళ్లంట, పూలరంగడు చిత్రాలను మించిన ఎంటర్ టైన్మెంట్ ఈచిత్రంలో మనకు లభిస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.
ప్రస్తుతం నాగార్జున నటించిన శిరిడి సాయి ఇప్పటికే విడుదలైన సాయి భక్తులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు ఆయన నటించిన 'డమరుకం' చిత్రం అక్టోబర్ 11న విడుదలకు సిద్దం అవుతోంది. శిరిడి సాయి చిత్రం శిరిడి సాయిబాబా చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందింది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'డమరుకం'. ఈచిత్రంలో నాగార్జున సరసన అనుష్క రొమాన్స్ చేస్తోంది.