Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సమంత, చైతన్యకు షాక్ ఇవ్వబోతున్నా.. అఖిల్ అందుకే రాలేదు.. నాకు పిల్లలు లేరు: నాగార్జున
అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం 'మన్మథుడు 2'. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. దీనిని పురస్కరించుకుని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఫ్యాన్స్ గోల - సైలెంట్ అయిన నాగ్
ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ అందరూ అఖిల్ అఖిల్ అని అరవడం స్టార్ట్ చేశారు. వాళ్లు ఏమంటున్నారో అర్థం కాకపోవడంతో నాగ్ చాలా సమయం సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత స్టేజ్ కింది నుంచి ఎవరో వచ్చి అఖిల్ గురించి అరుస్తున్నారు అని చెప్పడంతో దీనిపై ఆయన స్పందించారు.
అఖిల్ అందుకే రాలేదు
అభిమానులు అఖిల్ గురించి అడుగుతుండడంతో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అఖిల్ తన కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ఫంక్షన్కు రాలేదని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్వకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
నాకు పిల్లలు లేరు
ఇదే వేడుకలో తన పిల్లల గురించి కూడా నాగార్జున పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అంతా అంటున్నారు. అది వాస్తవం కాదు. నాకు పిల్లలు లేరు. ఉన్నది ఇద్దరు తమ్ముళ్లు' అని ఆయన సరదాగా అన్నారు. దీంతో ఫ్యాన్స్ అందరూ లవర్ బాయ్, లవర్ బాయ్ అంటూ గోల చేశారు.
చై, సామ్కు షాక్ ఇవ్వబోతున్నా
ఈ సినిమాతో తన కొడుకు, కోడలికి షాక్ ఇవ్వబోతున్నానని నాగార్జున చెప్పారు. ‘ఈ సమ్మర్కి మా పెద్దబ్బాయి ‘మజిలీ' అనే సినిమాతో మీ ముందుకు వచ్చాడు. మొన్న ‘ఓ బేబీ' అంటూ నా కోడలొచ్చింది. రేపు ఆగస్ట్ 9న ఆ రెండింటిని ఫసక్.. అవుట్. నేనొస్తున్నాను' అని సరదాగా మాట్లాడారు నాగ్.
నవ్వుతూనే ఉంటారు
అలాగే, అక్కినేని నాగార్జున చివర్లో తన సినిమా గురించి మాట్లాడారు. ‘మీకు ప్రామిస్ చేస్తున్నాను. ‘మన్మథుడు 2' కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంటారు' అని ఆయన వెల్లడించారు.