Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవి కూతురుతో అఖిల్కు లింక్.... స్పందించిన నాగార్జున!
అఖిల్ రెండో సినిమాపై వచ్చిన పుకార్లను నాగార్జున ఖండించారు. శ్రీదేవి చిన్న కూతురు ఈచిత్రంలో నటిస్తున్న వార్తలు నిజం కాదన్నారు.
హైదరాబాద్: తన కుమారుడు అక్కినేని అఖిల్ విషయంలో ప్రచారంలోకి వస్తున్న పుకార్లను నాగార్జున ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. తాజాగా అఖిల్ రెండో సినిమా విషయంలో వచ్చిన రూమర్స్ ఆయన వెంటనే ట్విట్ట్ ద్వారా ఖండించారు.
'అఖిల్ కోసం శ్రీదేవి కూతురిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్న నాగార్జున' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు కావడంతో .... ఇది నిజం కాదని, ఇలాంటి పుకార్లు నమ్మవద్దని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అఖిల్ తెరంగ్రేటం చేసిన తొలి సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ కావడంతో.... అఖిల్ను హీరోగా నిలబెట్టేందుకు నాగార్జున స్వయంగా బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ రెండో మూవీ తానే స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నిర్మిస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ సూపర్ హిట్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ను హీరోయిన్గా తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగార్జున స్పందిస్తూ అది నిజం కాదన్నారు.