Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
తొలిసారి రాయలసీమ యాసలో నాగార్జున డైలాగ్స్
మొన్న కింగ్ చిత్రంలో తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడి అలరించిన నాగార్జున తాజాగా రాయలసీమ మాండలీకంలో మాట్లాడటానికి సమాయుత్తమవుతున్నట్లు సమాచారం. బిందాస్ చిత్రంతో దర్శకుడుగా మారిన వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నాగార్జున ఈ శ్లాంగ్ తో రాసిన డైలాగులు చెప్పబోతున్నారు. ఇక ఈ చిత్రం ఓ మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ విషయం గురించి నాగార్జున స్వయంగా చెపుతూ...ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతాం. అలాగే తొలిసారిగా రాయలసీమ శ్లాంగ్ ని ఈ చిత్రంలో నేను మాట్లాడబోతున్నాను. ఇక ఈ చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనుష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక గతంలో నాగార్జున సంతోషం చిత్రానికి వీరుపోట్ల మూల కథ అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అలాగే వీరూ పోట్ల గతంలో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు కథను, సంతోషం, మనసంతా నువ్వే చిత్రానికి మూల కథను అందించారు.