Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
జస్ట్ ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున..!
అక్కినేని నాగార్జున నటిస్తున్న 'రాజన్న' చిత్రం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని డిసెంబరు 23న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా కథ 1960 లో తెలంగాణా ప్రాంతానికి చెందిన కథ. ఈ సినిమాకి సంభందించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 20నిమిషాలు, కాగా నాగార్జున పాత్ర ఎంట్రీ ఇంటర్వెల్ కి ముందు ఉంటుంది. ఈ సినిమాలో మల్లి పాత్ర పోషించే 'ఏనీ' ముఖ్య పాత్ర పోషిస్తుండగా సినిమా బాగా తీర్చి దిద్దారని సమాచారం.
రాజమౌళి యాక్షన్ పార్ట్ చిత్రీకరించిన ఈ చిత్రానికి, కీరవాణి అందించిన ఆడియో విడుదలై విశేష ఆదరణ పొందింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. ఖచ్చితంగా రాజన్నతో నాగార్జున పెద్ద హిట్ కొడతాడని ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ నిజమైతే కనుక 'మాస్' తర్వాత అన్నీ ఓ మాదిరి సినిమాలే చేసిన నాగార్జునకి ఆకలి మొత్తం తీరిపోయినట్టే. వరుసగా చైతన్య కొట్టిన రెండు దెబ్బలకి కోలుకోని అక్కినేని అభిమానులకి మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చినట్టే. ఈచిత్రంలొ ఏవీ అనే పాప ముఖ్య పాత్ర పోషించగా, స్నేహ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ రచయిత రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు.