Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
‘స్లమ్డాగ్ మిలియనీర్’విలన్ తో నాగార్జున ఫైట్
'స్లమ్ డాగ్ మిలియనీర్"లో విలన్గా నటించిన అంకుర్ నాగార్జున తాజా చిత్రంలో విలన్గా కనిపించనున్నాడు. రమ్మీ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగార్జునతో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అక్టోబర్ 10 నుంచి గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నాగ్ సరసన మమతామోహన్దాస్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నాగార్జుతో కింగ్ నిర్మించిన డి.శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 'ఈ షెడ్యూల్లో నాగార్జునతో మోడల్స్ పాల్గొనగా ఓ పాటతోపాటు, షాయాజి షిండే, బ్రహ్మానందంల కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్స్, చేజింగ్ సీన్స్ చిత్రీకరించాం. 'స్లమ్ డాగ్ మిలియనీర్"లో విలన్గా నటించిన అంకుర్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నారు. అలాగే అమెరికా అమ్మాయి లిండా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. డిసెంబర్లోనే ఈ చిత్రం విడుదల చేసేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ఇక ఈనెల నాలుగు వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. అనంతరం మళ్లీ 12 నుంచి హైద్రాబాద్లో జరిగే మరో షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు.సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, పోరాటాలు: సెల్వ, కార్యనిర్వాహక నిర్మాత: అక్కినేని వెంకటరత్నం.