Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘స్లమ్డాగ్ మిలియనీర్’విలన్ తో నాగార్జున ఫైట్
'స్లమ్ డాగ్ మిలియనీర్"లో విలన్గా నటించిన అంకుర్ నాగార్జున తాజా చిత్రంలో విలన్గా కనిపించనున్నాడు. రమ్మీ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగార్జునతో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అక్టోబర్ 10 నుంచి గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నాగ్ సరసన మమతామోహన్దాస్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నాగార్జుతో కింగ్ నిర్మించిన డి.శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 'ఈ షెడ్యూల్లో నాగార్జునతో మోడల్స్ పాల్గొనగా ఓ పాటతోపాటు, షాయాజి షిండే, బ్రహ్మానందంల కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్స్, చేజింగ్ సీన్స్ చిత్రీకరించాం. 'స్లమ్ డాగ్ మిలియనీర్"లో విలన్గా నటించిన అంకుర్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నారు. అలాగే అమెరికా అమ్మాయి లిండా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. డిసెంబర్లోనే ఈ చిత్రం విడుదల చేసేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ఇక ఈనెల నాలుగు వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. అనంతరం మళ్లీ 12 నుంచి హైద్రాబాద్లో జరిగే మరో షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు.సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, పోరాటాలు: సెల్వ, కార్యనిర్వాహక నిర్మాత: అక్కినేని వెంకటరత్నం.