Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్లాపుకి కారణం నాగార్జునే అంటున్నారు
నాగచైతన్య తాజా చిత్రం దడ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ రేంజి ప్లాప్ కి కారణం నాగార్జున,శివ ప్రసాద్ రెడ్డి అని తేల్చారు.నాగచైతన్య పూర్తి స్ధాయిలో సంతృప్తి చెంది దడని చేయలేదని,అతనికి స్క్ర్రిప్టు నచ్చలేదని చెప్తున్నారు.అయితే నాగార్జునకి ఆ కథ బాగా నచ్చటంతో తన కుమారుడికి కొత్త యాక్షన్ ఇమేజ్ వస్తుందని ఆశతో చేయించాడని ఆ ప్లాన్ రివర్స్ అయిందని అంతటా వినిపిస్తోంది.ఏమి మాయ చేసావే,100% లవ్ చిత్రాలు లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చాయని,దానిని ఎట్లా అయినా మార్చి మిగతా యంగ్ హీరోలకు పోటీగా నిలబెట్టాలనే నాగార్డున తాపత్రయమే సినిమాను ముంచిందని చెప్తున్నారు.అందులోనూ కామాక్షి బ్యానర్ పై చేసిన సినిమాలు వరసగా పోతున్న నేపధ్యంలో మరింత శ్రద్ద పెట్టాల్సింది పోయి కేవలం దర్శకుడుపై నమ్మకంతో వదిలేసాడని,అదే సినిమాను నాశనం చేసిందంటున్నారు.అందులోనూ అదే దర్శకుడు తీసిన గత చిత్రం హౌస్ ఫుల్ రిలీజ్ కూడా కాలేదని,అది తెలిసి కూడా నాగార్జున పట్టుపట్టి దడ చేయించాడని చెప్పుకుంటున్నారు.