Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సమంతను అలా చూడలేకపోయాను. చాలా ఇబ్బందిగా ఉంది.. నాగార్జున
Recommended Video
నాగచైతన్యతో వివాహం తర్వాత విడుదల అవుతున్న సమంత చిత్రం రాజుగారి గది2. ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్కు సిద్ధమవుతున్నది. రాజుగారి గది1 చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్నది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తొలిసారి ఓ హారర్, సస్సెన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
లాయర్గా సమంత
ఈ చిత్రంలో సమంత ఆత్మ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆత్మగా మారడానికి ముందు సమంత ఓ లాయర్. అయితే లాయర్ వృత్తిని నిర్వహించే సమంత పాత్ర ఎందుకు చనిపోయింది అనేది ఈ చిత్రంలో కీలక అంశం. ఈ చిత్రంలో సమంత పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే విధంగా ఉంటుంది అని ప్రచారం జరుగుతున్నది. ఆ చిత్రంలో లాయర్ పాత్రకు సంబంధించిన సమంత ఫోటో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
చిన్మయి కంటతడి
రాజుగారి గది2 చిత్రంలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఓ దశలో కంటతడి పెట్టుకొన్నదట. సమంత పాత్ర నన్ను హృదయాన్ని తాకింది అని చిన్మయి ఇటీవల ట్వీట్ చేశారు. అంతేకాకుండా సమంత ఆత్మతో చేసిన సీన్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు.
సమంతను అలా చూడలేకపోయాను
దెయ్యం పాత్రలో నటించిన సమంతను అలా చూడలేకపోయాను. తెర మీద సమంతను చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. చైతూ అసలు రాజుగారి గది చిత్రాన్ని చూడను అని తనతో చెప్పాడు అని నాగార్జున వెల్లడించారు.
మెంటలిస్టుగా నాగార్జున
రాజుగారి గది2 చిత్రంలో నాగార్జున మెంటలిస్టుగా నటిస్తున్నారు. ఎదుటి వ్యక్తుల్లో ఉండే విషయాలను పసిగట్టే పాత్రను నాగ్ పోషించారు. ఈ పాత్ర కోసం నాగార్జున పలువురు మెంటలిస్టులను, కొన్ని పరిశోధనలను కూడా చేశారు.
అతిథి పాత్రలో కాజల్
రాజుగారి గది2 చిత్రం మలయాళంలో వచ్చిన చిత్రానికి ఆధారం. ఈ చిత్రంలో నాగార్జున, సమంతతోపాటు వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, అశ్విన్ బాబు నటించారు. అయితే కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించిందనే ప్రచారం జరుగుతున్నది.