నాగార్జున తో ఆవకాయ బిర్యాని తినిపించటానికి సాక్షి ఛానెల్ వారు రెడీ అయ్యారు. అంటే ఆవకాయ బిర్యాని సినిమాతో పరిచయమైన బిందుమాధవితో సాక్షి వారు నాగార్జున ఇంటర్వూ ప్రసారం చేయనున్నారు. బిందుమాధవి ఈ ఛానెల్ లో దిల్ సే అనే పోగ్రామ్ ని నిర్వహించనుంది. ప్రతీ ఆదివారం ఉదయం తొమిదన్నరకి ప్రసారమయ్యే ఈ పోగ్రామ్ లో సెలబ్రటీల ఇంటర్వూలు చోటుచేసుకోనున్నాయి. దాంతో వారు ఈ పోగ్రామ్ కి ఫస్ట్ గెస్ట్ గా నాగార్జునని పిలిచారు.ఇరవై మూడవ తేదిన ఈ పోగ్రామ్ టెలీకాస్ట్ కానుంది. ఇక సాక్షి ఛానెల్ మొట్టమొదటి హై డెఫినీషియన్ ఛానెల్ ఇండియాలో కావటం ఓ విశేషం. ఏదైమైనా సాక్షికీ నాగార్జునకీ ఉన్న అనుబంధం మరోసారి తెరకెక్కనుంది. హాట్ టాపిక్ కానుంది.