Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ టైటిల్ కు పద్నాలుగు లక్షలు అడిగారనే...నాగార్జున
మేం మొదట మా చిత్రానికి రమ్మీ అనే టైటిల్ అనుకున్నాం అయితే ఆ టైటిల్ మీడియా ద్వారా బయిటకు వచ్చి వేరే బ్యానర్ వారు రిజిస్టర్ చేసారు..దాంతో మోసగాడు అని మరో టైటిల్ అనుకున్నాం..అయితే ఆ టైటిల్ వెబ్ సైట్స్ లో వచ్చింది...మీడియాలో ప్రచారం పొందింది. దాంతో ఆ టైటిల్ నీ వేరే వారు రిజిస్టర్ చేసి పద్నాలుగు లక్షలు డిమాండ్ చేసారు... దాంతో ఇక ఈ సారి మా నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి,నేనూ కలసి టైటిల్ ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు లీక్ అవుతుందని భావించాము. అలా కేడీ టైటిల్ ని అనుకుని అఫీషియల్ గా ప్రకటిస్తున్నాం. అంటూ తాము టైటిల్ కోసం పడ్డ శ్రమను వివరించారు నాగార్జున మీడియాతో. అలాగే తనకు డిసెంబర్ లో రిలీజ్ చేయాలనే సెంటిమెంట్ ఏమీ లేదని ప్రకటించారు. మీడియా తనకు ఆ సెంటిమెంట్ ను అంటగట్టిందని అన్నారు. నేను డిసెంబర్ లో నా చిత్రాలు రిలీజ్ చేయటానికి కారణం కేవలం శెలవలలో కలెక్షన్స్ బాగుంటాయనే ఉద్దేశ్యంతోనే..అంతే తప్ప మరేమీ కాదని వివరించారు. ఇక ఈ చిత్రం జనవరి 2010లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అందులోనూ మా నిర్మాతకు తమ బ్యానర్ 2010లో సిల్వర్ జూబ్లీ ఇయర్...జరుపుకోనుంది...అనేది కూడా రీజన్ అన్నారు.