twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త చిత్రం కమిటైన నాగార్జున

    By Srikanya
    |

    నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ జతకట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రియల్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఎంటర్టైన్మెంట్ తో కలసిన లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దనున్నారు. అలాగే నాగార్జున రెగ్యులర్ నిర్మాత డి.శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని తమ కామాక్షి బ్యానర్ పై నిర్మిస్తారు.ప్రస్తుత నాగార్జున రెగ్యులర్ గా ఢమురకం షూటింగ్ లో పాల్గొంటున్నారు.వేసవికి ఈ చిత్రం విడుదల అవుతుంది.

    నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది.

    ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Dasarath who directed Nagarjuna in 2002 with his debut movie Santhosham is ready to direct him again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X