నాగార్జున, దిల్ రాజు చిత్రం జనవరి నుంచే...
నాగార్జున, రాధా మోహన్ కాంబినేషన్లో రూపొందనున్న పయినం చిత్రం జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశమంత వంటి హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాధా మోహన్ సున్నితమైన భావోద్వేగాల గల సబ్జెక్టుతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జన హీరోగా చేస్తున్న రమ్మీ చిత్రం డిసెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కిరణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే దిల్ రాజు..ఎన్టీఆర్ తో బృందావనం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మున్నా చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్న వంశీ పైడపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
More from Filmibeat
నాగార్జున దిల్ రాజు రాధా మోహన్ ప్రకాష్ రాజ్ త్రిష ఆకాశమంతా కిరణ్ రమ్మీ nagarjuna dil raju radha mohan prakash raj trisha akasamantha


Click it and Unblock the Notifications











