Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ టాపిక్: నాగార్జున-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మళ్లీ మల్టీస్టారర్ సినిమాల జోరు సాగుతోంది. వెంకీ-మహేష్ కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో ఇలాంటి సినిమాల వైపు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు సర్వత్రా చర్చనీయాంశం అయింది. దీంతో పాటు మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు కూడా తెరకెక్కించేందుకు పలువురు నిర్మాతలు, దర్శకులు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా మరో ఆసక్తికర కాంబినేషన్ గురించి ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. నాగార్జున-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పివిపి సినిమా వారు నిర్మించే అవకాశం ఉన్నట్లు టాక్.
అయితే ఈ చిత్రం ఇంకా చర్చల దశలోనే ఉందని, అన్నీ ఓకే అయితే త్వరలోనే నిర్మాతల నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందిన అంటున్నారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ రభస చిత్రం షూటింగులో బిజీగా గడుపుతుండగా, నాగార్జున 'మనం' చిత్రం విడుదల విషయాల్లో బిజీగా ఉన్నారు.