Don't Miss!
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
'గ్రీకువీరుడు' సీజీ వర్క్లో కొన్ని లోపాలు: నాగార్జున
హైదరాబాద్ : సీజీ వర్క్లో కొన్ని లోపాలున్న మాట నిజమే...అంటూ ఒప్పుకున్నారు నాగార్జున. తన తాజా చిత్రం 'గ్రీకువీరుడు' సక్సెస్ మీట్ లో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. 'గ్రీకువీరుడు' సినిమా గ్రాఫిక్స్ బాగోలేందంటూ విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఆయన ఇలా స్పందించారు.
ఇక తాను ఊహించినట్లుగానే ఫ్యామిలీ ఆడియెన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ 'గ్రీకువీరుడు' ఆకట్టుకుందని ఆయన అన్నారు. ఇక ఓవర్సీస్లోనూ సినిమా బాగా ఆడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 'సంతోషం' వంటి హిట్ తర్వాత దశరథ్ కాంబినేషన్లో మరో హిట్ రావడం ఇంకా ఆనందంగా ఉంది. సంభాషణలకు ప్రేక్షకులు బాగా స్పందిస్తున్నారు.
కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కె. విశ్వనాథ్గారు భుజం తడితే కన్నీళ్లు వచ్చేవి. నయనతారకీ, నాకూ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చాలా మంది అంటున్నారు. తను చక్కని నటి. తమన్ సంగీతం, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్ అయ్యాయి. నాన్నగారు సినిమా చూసి చాలా బావుందన్నారు. అఖిల్కి కూడా ఈ సినిమా బాగా నచ్చింది అని చెప్పారు నాగార్జున.
"దాసరి గారు ఫోన్చేసి 'ఏడంతస్తుల మేడ' చిత్రాన్ని నీతో రీమేక్ చేస్తే బాగుంటుంది, 'గ్రీకువీరుడు' చూశాక నువ్వు ఆ కథకు యాప్ట్ అవుతావు అనిపించింది.. అని చెప్పారు. ఆ సినిమా సీడీ కూడా ఇచ్చారు. చూసి నిర్ణయించాలి'' అని చెప్పారన్నారు.