Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా వాళ్లని భయపెట్టదంటూ నాగార్జున
ప్రస్తుతం రాష్ట్రంలో వున్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా పరిశ్రమ గురించి నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ... రాష్ట్ర విభజన తరువాత సినీ పరిక్షిశమ వైజాగ్కు తరలిపోతుందనే అలాంటి ఆలోచన ప్రస్తుతానికి ఏమీ లేదు. మద్రాసులో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నపుడు అక్కడి నుంచి పరిశ్రమను హైదరాబాద్ తరలించాలని మర్రి చెన్నాడ్డి, జలగం వెంగళరావు గారు చాలా కృషి చేశారు. మద్రాసు నుంచి హైదరాబాద్కు చిత్ర పరిక్షిశమ తరలిరావాలని మా నాన్న గారిని వారు కోరడం జరిగింది. ఇక్కడే స్టూడియోలను కట్టమని కూడా అడగడంతో అన్నపూర్ణ స్టూడియోస్ను నిర్మించడం జరిగింది. ఇదంతా 63లో జరిగింది. మద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడానికి 30 ఏళ్లు పట్టింది. అయినా ఇప్పటికీ రీ-రికార్డింగ్ల కోసమని, ఇతర సాంకేతిక నిపుణుల కోసమని బాంబే, చెన్నై వెళ్లాల్సి వస్తోంది అన్నారు.
ఇక విభజన తరువాత సీమాంధ్ర వేరే రాష్ట్రం అవుతుంది కదా ఇక్కడ నిర్మించే సినిమాలకు రాయితీలకు సంబంధించిన సమస్య తలెత్తే అవకాశం ఉంటుదనే విషయం గురించి చెప్తూ... రాష్ట్ర విభజన వల్ల చిత్రపరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇప్పటికీ చాలా వరకు వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్లు చేస్తున్నాం. రామానాయుడుగారు వైజాగ్లో స్టూడియో కట్టారు. అందులోనూ షూటింగ్లు జరుగుతున్నాయి. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. విభజన అయిపోయాక రెండు రాష్ట్రాల ముఖ్యమంవూతులతో సమావేశమై ఎలా చేస్తే బాగుంటుంది ఏవిధంగా చేస్తే సమస్యలు రావో అందరం కలిసి చర్చిస్తాం. ఇప్పటి నుంచే ఏం జరుగుతుందో? ఏమైపోతుందో అంటూ లేనిపోని అపోహలు పెట్టుకుంటే ప్రశాంతత పోతుంది. అయినా సినీ పరిక్షిశమ హైదరాబాద్ను వదిలి అవసరం లేదని నా అభిప్రాయం అన్నారు. నాగార్జున త్వరలో 'భాయ్'గా మరోసారి తనదైన మార్కు ఎంటర్టైనర్తో ఆకట్టుకోబోతున్నారు.