Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాలుగేళ్లు పూర్తైన సంధర్బంగా.. నాగార్జున ఎమోషనల్ ట్వీట్!
అక్కినేని కుటుంబం మొత్తం చిరస్థాయిగా గుర్తుంచుకునే చిత్రం 'మనం'. ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం కూడా ఇదే. మనం చిత్రం విడుదలై నేటికి సరిగ్గా నాలుగేళ్ళు. నాగార్జున, తన తండ్రి ఎన్నార్ తో కలసి అనేక చిత్రాల్లో నటించారు. అక్కినేని ఫ్యామిలి మొత్తం కలసి ఓ చిత్రంలో నటించాలని నాగార్జున భావిస్తున్న తరుణంలో దర్శకుడు విక్రం కుమార్ మనం చిత్ర కథని వినిపించారు.
పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం 2014 లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. క్లాసికల్ హిట్ అని కుడా అభివర్ణించబడింది. ఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, సమంత ఈ చిత్రంలో నటించారు. శ్రీయ హీరొయిన్ గా నటించింది. అఖిల్ కామియో రోల్ పోషించాడు.
అన్ని పాత్రలని బ్యాలన్స్ చేస్తూ విక్రం కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. నాలుగేళ్ళు పూర్తైన సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా నాగార్జున ఏఎన్నార్ ని గుర్తు చేసుకున్నారు. మమ్మల్ని నవ్వించి, ఏడిపించి వెళ్ళిన మీగురించి ఎప్పుడూ అలోచిస్తుంటాం నాన్న అంటూ ట్వీట్ చేశారు.
It’s been 4 yrs since #Manam released. I hv been thinking of how you made us cry,laugh and finally inspire the family to face life and death!! we think of you all the time NANA and we smile🙏 #ANRliveson pic.twitter.com/XjCM1YrFne
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2018