Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నా కొడుకుని మోయండి..నాగార్జున
నా కుమారుడు నాగచైతన్యను మీ భుజాలపై మోసుకెళ్ళండి అంటూ నాగార్జున తన అభిమానులను అర్దించాడు. జోష్ ఆడియో పంక్షన్ లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ఎమోషనల్ గా ఈ విషయం చెప్పారు. "మా నాన్న, రామానాయుడుగారు ఇద్దరూ లివింగ్ లెజండ్స్. నేనూ, వెంకీ వాళ్లను అందుకోలేకపోయాం. చైతన్య మమ్మల్ని దాటుకుని వెళ్లి తన తాతలంతటి పేరు తెచ్చుకోవాలి. చైతూ నటన పట్ల తనకున్న ఆసక్తిని సరైన సమయంలో కనబరిచాడు. తనతో నేనే సినిమా తీద్దామనుకున్నాను.
కానీ దిల్రాజు మంచి కథతో ముందుకొచ్చారు. మూడు తరాలుగా మమ్మల్ని అభిమానిస్తున్న అభిమానులకు చైతన్యను అప్పగిస్తున్నా. మీ భుజాలపై మోసుకెళ్లండి" అన్నారు. నాగచైతన్య, కార్తిక జంటగా నటించిన చిత్రం 'జోష్'. దిల్ రాజు నిర్మాత. వాసు వర్మ దర్శకుడు. శాసనసభ స్పీకర్ కిరణ్కుమార్రెడ్డి తొలి సీడీని ఆవిష్కరించారు. అక్కినేని నాగేశ్వరరావు, డా.డి.రామానాయుడు సంయుక్తంగా అందుకున్నారు. క్యాసెట్ ను కె.రాఘవేంద్రరావు విడుదల చేసి మంచు మోహన్ బాబుకు అందజేశారు.