Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రత్యేక విమానంలో మన వూరికి నాగార్జున
నాగార్జున ఫిబ్రవరి 10 వ తేదీన రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాలకు ప్రత్యేక విమానంలో హాజరు కానున్నారు. ఆయన తాజా చిత్రం 'గగనం' ప్రమోషన్ నిమిత్తం నిర్మాత దిల్ రాజు ఇలా ప్లాన్ చేసారు. ఈ విషయాన్ని మీడియాకు వివరిస్తూ...'' రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు విరుద్ధంగా కొత్త తరహాలో సాగే చిత్రమిది. అందుకే పబ్లిసిటీని కూడా వినూత్నంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నాం. విడుదలకు ముందే మీడియావారికి 'గగనం' చిత్రం చూపిస్తాం. సినీ ప్రముఖల కోసం ఓ ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. అలాగే ప్రేక్షకులకూ 'గగనం' సినిమాని ముందే చూపించాలి అనుకొంటున్నాం. ఫిబ్రవరి 10న రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో నాలుగు ఆటలు ప్రదర్శిస్తాం. నాలుగు చోట్లకు నాగార్జునను తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతామన్నారు.
ఈ చిత్రంలో నాగార్జున కమాండోగా చేస్తున్నారు. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్కు బాస్ని నాగార్జున. ఫ్లైట్ హైజాగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్ ఇన్సిడెంట్ను పోలి వుంటాయి. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది. ఈ చిత్రంలో కత్తి లో చేసిన సనాఖాన్ ప్రయాణికుల్లా చేస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: కె.కబీర్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.