Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగార్జున 'లవ్స్టోరీ'హార్ట్ టచ్చింగ్ గా...
నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'లవ్స్టోరీ'. నయనతార హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం కి సంభందించి ఇటీవల హైదరాబాద్లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈనెల 21 నుంచి మరో షెడ్యూలు ప్రారంభిస్తారు. ఈ చిత్రం అటు ఫ్యామిలీని, ఇటు యూత్ ని ఆకట్టుకునే విధంగా రూపొందుతోందని నిర్మాత చెప్తున్నారు.
దర్శకుడు దశరధ్ మాట్లాడుతూ...దేవదాసు కాలం నుంచి ప్రేమకథలు చూస్తూనే ఉన్నాం. ప్రతీసారీ ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దర్శకులు. వెండి తెరపై ఆహ్లాదం పంచిన ప్రేమ కథకే ప్రేక్షకులూ ఓటేస్తున్నారు. మా ప్రేమ కథలోనూ ఆ కొత్తదనం కనిపిస్తుంది అన్నారు.''యువతరాన్ని ఆకట్టుకొనే ప్రేమకథలకే విజయాలు దక్కాయి. మా సినిమాలో కూడా వారికి నచ్చే అంశాలున్నాయి. నాగార్జున ఆహార్యం కొత్తగా అనిపిస్తుంది. దశరథ్ ఈ కథను మలుస్తున్న విధానం బాగుంది. కుటుంబ బంధాలకూ చోటుంది. తమన్ సంగీతం అందరినీ అలరిస్తుంది''అన్నారు నిర్మాత.
ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా 'బంగారం' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసిన మీరాచోప్రా ని ఎంపిక చేసారు. ఆమె బంగారం తర్వాత 'వాన', 'జగన్మోహిని' చిత్లాల్లో నటించినా బ్రేక్ రాలేదు. అంతేగాక గత ఏడాది 'మారో' ద్వారా మరోసారి తెలుగు తెరపై కనిపించారామె. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినిమాలు అంగీకరించలేదు. ఇక సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసినట్లేనని కొంతమంది చెప్పుకున్నారు. అందం, అభినయం ఉన్న మీరా సినిమాలకు ఎందుకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చిందని కూడా చర్చించుకున్నవారు ఉన్నారు.
తాజాగా 'లవ్స్టోరి'తో మళ్లీ తెలుగులో చేస్తోంది. ఈ రీల్ 'లవ్స్టోరి'కి నాయకుడు నాగార్జున. 'సంతోషం' తర్వాత నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీరా కూడా ఉన్నారు. నాగ్ సరికొత్త లుక్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో మీరా ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో తను చేసిన మూడు చిత్రాలు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ చిత్రం ఆ కొరతని తీర్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు. కామాక్షి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని చందన్రెడ్డి నిర్మిస్తున్నారు.