Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫ్లైట్ హైజాక్ స్టోరీ పాయింట్ తో నాగార్జున చిత్రం
నాగార్జున,రాధామోహన్ (ఆకాశమంతా దర్శకుడు)కాంబినేషన్లో పయినం అనే చిత్రం రూపొందతోందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కథ పూర్తిగా ఓ ప్లైట్ హైజాక్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. కాందహార్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ తయారు చేసాడని అంటున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్న ప్రకాష్ రాజ్ తమిళ మీడియాతో చెప్పుకొచ్చారు. కెప్టెన్ దేవి శరన్ రాసిన ఫ్లైట్ ఇంటూ ఫియర్ అనే పుస్తకం ఆధారంగా ఈ కథ తయారుచేయబడింది. ఈ పుస్తకం 1998లో టెర్రరిస్టులు కాందహార్ ప్లేన్ ని హైజాక్ చేయటం..తదితర పరిణామాలు ఆధారంగా రాసారు...ఈ పుస్తకం చదవగానే నాకు దీన్ని సినిమా చేయాలని పించింది. ఇందులో నేను ప్రధాన మంత్రి ఆఫీసులో పనిచేసే ఓ గవర్నమెంట్ ఉద్యోగిగా కనిపిస్తాను. టెర్రరిస్టులు గవర్నమెంట్ ను బెదిరించటం నుంచి తిరుపతిలో ల్యాండ్ అవటం దాకా వివరంగా చూపుతాం. అలాగే ఇందులో ఉండే ప్యాసింజర్స్, వారి మధ్య జరిగే రకరకాల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది అన్నారు. ఇక ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నాగార్జున కనిపిస్తారు. దిల్ రాజు దీనిని హై బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ దీనిని కన్నడ,తమిళ భాషల్లో దీనిని రీమేక్ చేస్తున్నారు.