Don't Miss!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగచైతన్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!?
అక్కినేని వారసుడిగా తెరంగ్రేటం చేసిన నాగచైతన్యకి. తండ్రి నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విషయం ఏమిటంటే. ఇటీవల కోట శ్రీనివాస్ తనయుడు కోట ప్రసాద్ స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ మద్యన యంగ్ హీరో నవదీప్ కూడా అర్థరాత్రిలో బైక్ రేష్ లో మీడియాకు పట్టుబడి లక్షా ఇరవై ఐదువేల రూపాయలు మూల్యం కూడా చెల్లించాడని వార్తలు. ఈ నేపథ్యంలో బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే నాగచైతన్యకు ముందు జాగ్రత్తగా నాగ్ క్లాస్ పీకారట.
గతంలో చైతన్య బైక్ ను రాష్ గా డ్రైవ్ చేసిన సందర్భాలున్నందున మరోసారి అలాంటి పని చేయవద్దని, ఎప్పుడు కార్లోనే వెళ్లాలని, ఒక వేళ సరదాగా బైక్ నడిపినా తగిన జాగ్రత్తలు తీసుకుని నెమ్మదిగా వెళ్లాలని సూచించాడట. హైదరాబాద్ లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ట్రాఫిక్ ను దష్టిలో పెట్టుకొని అదే విధంగా మరికొందరు బడా బాబులు వారి పిల్ల సరదాలకో, మరి డబ్బు సంపాదనకో కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్స్ వున్నవారు వారి వారి పిల్లలకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరి నాగచైతన్య ఎటువంటి జోష్ లేకుండా తండ్రిమాట విని శ్రద్దా పాటిస్తాడో లేక అందరి కుర్రహీరోల్లా పెడచెవిన పెడతాడో వేచి చూడాల్సిందే.