Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘శిరిడి సాయి’ విజయ యాత్ర
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో భక్తిరస చిత్రం 'శిరిడి సాయి' హిట్ టాక్తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ యాత్రలు నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఈ విజయోత్సవ యాత్రలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేష్రెడ్డి మాట్లాడుతూ ప్రేక్షకులు సాయి చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటం దృష్ట్యా వారందరినీ కలుసుకోవాలని ఈ యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు.
కార్యక్రమం విశాఖపట్నం నుండి ప్రారంభమయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు లీలామహల్ థియేటర్, టెంపుల్లో ప్రేక్షకులను కలుసుకున్నారు, మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి అప్సర థియేటర్, ధవళేశ్వరం రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ బాబా మందిరం, అన్నపూర్ణ థియేటర్, ఐనోక్స్ల్లో ప్రేక్షకులను కలిసారు. ప్రేక్షకుల మంచి స్పందన వస్తోంది.
ఈ రోజు (సెప్టెబర్ 12) గుంటూరు, నెల్లూరు, కావలి, తిరుపతిలలో శిరిడీ సాయి ప్రదర్శిస్తున్న థియేటర్లలో ప్రేక్షకులను కలవనున్నారు. గతంలో నాగ్-రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా 'శిరిడి సాయి' చిత్రంతో హాట్రిక్ కొట్టారు. ఇక సినిమాకు కీరవాణి అందించిన సంగీతం, బ్యాంగ్రౌండ్ స్కోర్ మరింత వన్నె తెచ్చాయి.
శిరిడి సాయి చిత్రానికి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.