Don't Miss!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘శిరిడి సాయి’ విజయ యాత్ర
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో భక్తిరస చిత్రం 'శిరిడి సాయి' హిట్ టాక్తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ యాత్రలు నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఈ విజయోత్సవ యాత్రలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేష్రెడ్డి మాట్లాడుతూ ప్రేక్షకులు సాయి చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటం దృష్ట్యా వారందరినీ కలుసుకోవాలని ఈ యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు.
కార్యక్రమం విశాఖపట్నం నుండి ప్రారంభమయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు లీలామహల్ థియేటర్, టెంపుల్లో ప్రేక్షకులను కలుసుకున్నారు, మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి అప్సర థియేటర్, ధవళేశ్వరం రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ బాబా మందిరం, అన్నపూర్ణ థియేటర్, ఐనోక్స్ల్లో ప్రేక్షకులను కలిసారు. ప్రేక్షకుల మంచి స్పందన వస్తోంది.
ఈ రోజు (సెప్టెబర్ 12) గుంటూరు, నెల్లూరు, కావలి, తిరుపతిలలో శిరిడీ సాయి ప్రదర్శిస్తున్న థియేటర్లలో ప్రేక్షకులను కలవనున్నారు. గతంలో నాగ్-రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా 'శిరిడి సాయి' చిత్రంతో హాట్రిక్ కొట్టారు. ఇక సినిమాకు కీరవాణి అందించిన సంగీతం, బ్యాంగ్రౌండ్ స్కోర్ మరింత వన్నె తెచ్చాయి.
శిరిడి సాయి చిత్రానికి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.