Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మా అమ్మను...స్వామీ తీసుకెళ్లిపో అని ప్రార్థించా,తీర్చాడు: నాగార్జున
‘ఓం నమో వెంకటేశాయ’ ఆడియో లాంచ్ లో నాగార్జున భక్తి భావంతో, ఎమోషనల్ గా మాట్లాడారు.
హైదరాబాద్: '' మొదట సారి నేను అమ్మతో కలిసి తిరుమల వెళ్లా. వెంకటేశ్వరస్వామి నా ఇష్ట దైవం. ఇప్పటి వరకు ఆయన్ను మూడు కోర్కెలు కోరుకున్నా.. అన్నీ తీర్చాడు. మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చూడలేక.. స్వామీ తీసుకెళ్లిపో అని ప్రార్థించా. కొన్ని గంటల్లోనే తీసుకెళ్లిపోయాడు.
ఆ తర్వాత నాన్నగారి ఆఖరి సినిమా 'మనం' హిట్ అవ్వాలని మనసారా ప్రార్థించా. ఆ సినిమా సూపర్హిట్ అయింది. అన్నారు నాగార్జున. 'ఓం నమో వెంకటేశాయ' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే...మంచి కుటుంబాన్ని ఇచ్చావు. ఇద్దరు పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకున్నా. తిరుమలలో ఉండగానే తెలిసింది. మా ఇద్దరి పిల్లల కల్యాణం గురించి. ఇలా స్వామివారు నా కోర్కెలన్నీ తీర్చాడు. స్వామి తీర్చిన కొద్దీ కోర్కెల చిట్టా పెరుగిపోతోంది. శ్రీనివాసుడు ఎప్పుడూ నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంటుంది. శ్రీరామదాసు, అన్నమయ్య, శిరిడిసాయి, ఇప్పడు 'ఓం నమో వెంకటేశాయ'లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా'' అని వివరించారు. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక రాఘవేంద్రరావుకి, నాకు ఇదే చివరి సినిమా అవుతుందేమో తెలియదు కానీ... ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అమల, అనుష్క, ప్రజ్ఞాజైస్వాల్, నాగచైతన్య, అఖిల్, సంగీత దర్శకుడు కీరవాణి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.