twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఏ పార్టీ తొత్తునంటే..నాగ్

    By Staff
    |

    Nagarjuna
    నాగార్జున తనని కాంగ్రెస్ తొత్తు అంటున్నారని..అటువంటిదేమీ లేదని ప్రైవేట్ ఛానెల్స్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. తనకు కాంగ్రెస్ పథకాలు నచ్చే ప్రచారం చేసానని, అదీ బహిరంగంగానే అని చెప్పారు. అందునిమిత్తం లీడింగ్ న్యూస్ పేపర్స్ లో కూడా ఇంటర్వూలు ఇచ్చానన్నారు. అలాగే ఇంతకు ముందు కూడా తెలుగుదేశం ప్రవేశపెట్టిన శ్రమదానంకు తమ కుటుంబం మొత్తం పాల్గొన్నారని అంతమాత్రాన తెలుగుదేశం తొత్తును అనకూడదని, అలాగే చిరంజీవిగారితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నానని అలాగని పీఆర్పి తొత్తును కానని అనరాదని అన్నారు. అలాగే చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తులు ఇద్దరే నని వారు ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైయస్సార్ అని చెప్పారు.

    అలాగే సినీ గ్లామర్ ఉన్న వారంతా రాజకీయాల్లోకి రారని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. అంతేగాక పనిచేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోండంటూ పిలుపునిచ్చారు. అలాగే తాను అపోలో ఆస్పత్రికి వెళ్ళినప్పుడు అక్కడ పేద జనాన్ని చూసానని, అంత కార్పోరేట్ వైధ్యం వారెలెగ చేయించుకుంటున్నారంటే ఆరోగ్యశ్రీ ద్వారా అని తెలిసిందంటూ ప్రభుత్వ పధకాలను పొగిడారు. తెలంగాణ విడిపోవటంపై నాగార్జున వ్యతిరేక భావం వ్యక్తం చేసారు. తనకి ఆంధ్రా,తెలంగాణా అనే తేడాలేదని, విడిపోతే పాకిస్ధాన్, శ్రీలంకలా మారుతుందనన్నారు. విడిపోతే చాలా మైనస్ లు బయిటపడ్తాయిని అన్నారు. విడిపోవటం అనేది రాజకీయ అవసరం అని అదే ప్రజలు అవసరం అయితే జరుగుతుందని అన్నారు. తన స్నేహితులంతా తెలంగాణాలో సెటిల్ అయిన వారేనని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X