twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున టబూ ల ఆఫ్ స్ర్కీన్ కెమిస్ట్రీ !

    By Sindhu
    |

    బాలీవుడ్ నటి టబు చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా వుంటోంది. రీసెంట్ గా ల్యాక్ మే ఫాషన్ షో లో నాగర్జున, టబు కలసి జంటగా మళ్ళీ దర్శనమిచ్చిన విషయం విదితమే. వీరిద్దరి మద్య కొన్ని సంవత్సరాలుగా స్నేహం కొనసాగుతోంది. 'షాక్", 'ఇదీ సంగతి", 'పాండురంగడు" సినిమాల లో ఢిప్రెంట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే టబూకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా 'నిన్నే పెళ్లాడతా' అని చెప్పవచ్చు. స్ర్కీన్ పై నాగార్జున, టబుల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిన్నే పెళ్లాడత చిత్రం లో 'గ్రీకువీరుడు...నా రాకుమారుడు' అంటూ కుర్రకారును స్టెప్పులేయించిన టబూ ఈ చిత్రంలో నాగార్జునకు సరసన హీరోయిన్ గా నటించింది. అప్పట్నించీ ఇద్దరి మధ్యా 'ఆఫ్ స్క్రీన్' కెమెస్ట్రీ నడుస్తోందనే వార్తలు వచ్చాయి. నాగార్జున సైతం టబూ పట్ల ప్రత్యేక అభిమానం చూపుతుంటారు. ఒక సందర్భంలోనాగార్జున మాట్లాడుతూ 'టబూ నాకు బాగా దగ్గరైన మనిషి' అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో టబూను నాగార్జున ముద్దుపెట్టుకోవడం అక్కడున్నవారందరి దృష్టినీ ఆకర్షించింది.

    ఇదే విషయాన్ని హైదరాబాదీ భామ టబు దగ్గర ప్రస్తావిస్తే టబూ నవ్వుతూ సింపుల్ గా వివరణ ఇస్తూ 'చాలా సంవత్పరాలుగా, మీడియా, జనం మా గురించి ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తూనే ఉన్నారు. ఆ డిటైల్స్ లోకి మాత్రం వెళ్లదలచుకోలేదు. మీరు చూసే దానిలోనే సమాధానం ఉంది' అంటూ విషయం దాటేసింది. మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తారని అడిగితే మంచి స్ర్కిప్ట్ దొరికితే .నాగ్ తో మళ్లీ ఓ సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నాననీ, ఆయనతో కలిసి పనిచేయడం ఓ పిక్నిక్ లాగా ఉంటుందనీ మరోసారి నాగ్ పట్ల తనకున్న అభిమానం తెలియజేసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X