Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
స్వచ్ఛ్ భారత్ ఛాలెంజ్ స్వీకరించిన నాగార్జున
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జున ఆరు రోజుల తర్వాత ఎట్టకేలకు అనిల్ అంబానీ విసిరిన స్వచ్ఛ్ భారత్ చాలెంజ్ స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చురుకుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మన దేశాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి అనే నినాదంతో....పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం సాగుతోంది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్వయంగా పాల్గొని వీధులు శుభ్రం చేసారు. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడానికి పాటు పడాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నరేంద్ర మోడీ తొలుత కమల్ హాసన్, అనిల్ అంబానీ, సచిన్ టెండూల్కర్ మరో ఆరుగురు ప్రముఖులను ఈ కార్యక్రమం కోసం నామినేట్ చేసారు. తర్వాత అనిల్ అంబానీ....నాగార్జున పేరుతో సహా మేరీ కోమ్, సానియా మీర్జా ఇతరులను నామినేట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి కూడా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి తన మద్దతు ప్రకటిస్తూ వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే.