Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బి.జయ దర్శకత్వంలో సినిమా చేస్తా: నాగార్జున
''నేను చాలామంది దర్శకులతో పనిచేశాను కానీ, మహిళా దర్శకులతో చేయలేదు. మంచి కథతో వస్తే బి. జయ దర్శకత్వంలో సినిమా చేస్తా'' అని నాగార్జున అన్నారు. ఆది, శాన్వి జంటగా బి.జయ దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మించిన 'లవ్లీ' వందరోజుల వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ఆ విధంగా స్పందించారు.
అలాగే ఆ పంక్షన్ కి హాజరైన దాసరి నారాయణ రావు మాట్లాడుతూ..."ఈ మధ్య చిన్న హీరోలు కూడా కథ అడుగుతున్నారు. వాళ్లకు కథ గురించి ఏం తెలుసు! ఎన్టీఆర్, ఎయన్నార్ కూడా ఏనాడూ కథ అడగలేదు. సినిమా ఆడకపోతే తారలకన్నా సాంకేతిక నిపుణులకే ఎక్కువ నష్టం..ఇక ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు విజయం సాధించి పరిశ్రమకు ఊపిరిపోశాయి" అన్నారు.
"అలాగే 'లవ్లీ' కూడా ఆ కోవకు చెందుతుంది. విజయనిర్మల్లాగానే బి.జయ కూడా పని రాక్షసి. మన తెలుగులోనే ఎక్కువ మంది లేడీ డెరైక్టర్స్ ఉండడం గర్వకారణం. హీరో ఆది చిన్న నిర్మాతలకు అండగా నిలబడాలి" అని దాసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కె. రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, పూరి జగన్నాథ్, వి. వినాయక్, సునీల్, అచ్చిరెడ్డి, దశరథ్, సురేష్ రెడ్డి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. యూనిట్ సభ్యులకు అతిథులు షీల్డులందించారు.