twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ కొత్త టైటిల్ అదా?

    By Staff
    |

    నాగార్జున హీరోగా శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళా బ్యానర్ పై నిర్మిస్తున్న కొత్త చిత్రానికి 'రమ్మీ'అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులోనూ ఈ సినిమా కథ కూడా పేకాట నేపధ్యంలో సాగతుందని తెలుస్తోంది.మొదట టైటిల్ గా 'ఇస్పేట్ రాజా' అనుకున్నా గత చిత్రం టైటిల్ కూడా 'కింగ్' కావటంతో ' రమ్మీ' అని నిర్ణయించుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక 'కింగ్'లో నాగార్జున సరసన నటించిన మమతామోహన్ దాస్ మరోసారి ఈ చిత్రంలో ఆయన సరసన చేయనుంది.కిరణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. నాగార్జున గత చిత్రాల మాదిరే ఈ చిత్రంలోనూ యాక్షన్ ,రొమాన్స్ లతో పాటు ఈ పేకాట కూడా కొత్తగా అలరించనున్నాడు. ఇక ఈ చిత్రంలో చిత్రం గద సింగ్,పూజ అనే మరో ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక డాన్,కింగ్ వంటి రెండు అక్షరాల టైటిళ్ళ సరసన ఈ 'రమ్మీ'కూడా చేరనుంది.మొదటి షెడ్యూలు పూర్తిగా గుంటూరులో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూలుకి రెడీ అవుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X