twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నాగవల్లి' తొలి పరీక్షలో నెగ్గింది...వెంకటేష్

    By Srikanya
    |

    సంగీతపరంగా 'నాగవల్లి' విజయం సాధించి తొలి పరీక్షలో నెగ్గింది. చిత్రం కూడా అందరి ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాను. 'చంటి' చిత్రం నా కెరీర్ లో ఎలాంటి వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది. నిజాయితీగా సమిష్టి కృషితో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తీసాం. తప్పకుండ ప్రేక్షకులందరినీ ఈ చిత్రం సంతృప్తిపరుస్తుందనే నమ్మకం వుంది. ఈ చిత్రానికి గురుకిరణ్ మంచి సంగీతాన్ని, చంద్రబోస్ చక్కటి సాహిత్యాన్ని అందించారు అన్నారు వెంకటేష్. ఆయన హీరోగా ప్రముఖ దర్శకుడు పి.వాసు రూపొందించిన కన్నడ 'ఆప్తరక్షక' కు తెలుగు రీమేక్ 'నాగవల్లి' డబుల్ ప్లాటినం డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్ సినీమ్యాక్స్ లో జరిగింది.

    పి.వాసు మాట్లాడుతూ ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌తో కలిసి పనిచేయడం హ్యాపీగా వుంది. ఈ చిత్రం మ్యూజిక్ సక్సెస్ క్రెడిట్ మొత్తం గురుకిరణ్‌కే చెందుతుంది. సినిమా విడుదల తర్వాత అతని నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు అని తెలిపారు. చిత్రం విడుదలకు ముందే ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరుపుకోవడం ఆనందంగా వుందని, రీమేక్ సినిమా అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు.

    అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను చేతుల మీదుగా నటీనటులు, సాంకేతిక నిపుణులు డబుల్ ప్లాటినమ్ డిస్క్‌లు అందుకున్నారు. ఈ వేడుకలో పరుచూరి బ్రదర్స్, బి.గోపాల్, గురుకిరణ్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ్, కమలినీ ముఖర్జి, శ్రద్దాదాస్, ఆదిత్య దయానంద్ కూడా పాల్గొన్నారు.నాగవల్లి చిత్రంలో అనుష్క, రిచాగంగోపాధ్యాయ్, కమిలినీ ముఖర్జీ, పూనం కౌర్, శ్రద్ధాదాస్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ నెల 16న చిత్రం విడుదల కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X