పూజకు కూడా పనికిరాని రోజా గురించి తానేమీ మాట్లాడుదలచుకోలేనని ప్రజారాజ్యం పార్టీ నేత నాగేంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంస్కారం విస్మరించి ప్రవర్తించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. చిరుపై రోజా చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ...ఆమె పూజకు కూడా పనికిరాదు అన్నారు. చిత్ర శుద్దితో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చామని,రోజాపై మాట్లాటడం సమయం వృధా అని అన్నారు. ఎవరేమనకున్నా తమ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా తమ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు.
Story first published: Tuesday, February 10, 2009, 12:26 [IST]