Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎట్టకేలకు తెలుగులో నగేష్ కుకునూర్ మూవీ.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టితో రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా
హైదరాబాద్ బ్లూస్, రాక్ఫోర్డ్, ఇక్భాల్ లాంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ త్వరలో తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి నగేష్ కుకునూర్ మాట్లాడుతూ...'ఎట్టకేలకు నా మాతృభాషతో సినిమా తీస్తున్నందుకు, తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది, ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. త్వరలో అఫీషియల్ లాంచ్ జరుగుతుంది' అన్నారు.
'నా మాతృభాష తెలుగు అయినప్పటికీ నేను ఈ భాష రాయడం, చదవడం నేర్చుకోలేదు. ఆ బాధ ఇప్పటికీ నాలో అలాగే ఉంది. నాకు చాలా సార్లు తెలుగు సినిమా తీయాలనే ఆలోచన వచ్చేది, బయటి నుంచి కూడా ఆఫర్లు వచ్చేవి. కానీ భాష మీద పట్టులేదని భయం వేసేది.' అని నగేష్ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు అఫీషియల్ లాంచ్ సందర్భంగా వెల్లడించనున్నారు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. హైదరాబాద్, పూణెలో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా షూటింగ్ ప్రణాళికలు సిద్ధం చేశారు.