Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎట్టకేలకు తెలుగులో నగేష్ కుకునూర్ మూవీ.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టితో రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా
హైదరాబాద్ బ్లూస్, రాక్ఫోర్డ్, ఇక్భాల్ లాంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ త్వరలో తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి నగేష్ కుకునూర్ మాట్లాడుతూ...'ఎట్టకేలకు నా మాతృభాషతో సినిమా తీస్తున్నందుకు, తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది, ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. త్వరలో అఫీషియల్ లాంచ్ జరుగుతుంది' అన్నారు.
'నా మాతృభాష తెలుగు అయినప్పటికీ నేను ఈ భాష రాయడం, చదవడం నేర్చుకోలేదు. ఆ బాధ ఇప్పటికీ నాలో అలాగే ఉంది. నాకు చాలా సార్లు తెలుగు సినిమా తీయాలనే ఆలోచన వచ్చేది, బయటి నుంచి కూడా ఆఫర్లు వచ్చేవి. కానీ భాష మీద పట్టులేదని భయం వేసేది.' అని నగేష్ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు అఫీషియల్ లాంచ్ సందర్భంగా వెల్లడించనున్నారు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. హైదరాబాద్, పూణెలో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా షూటింగ్ ప్రణాళికలు సిద్ధం చేశారు.