Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్య హీరోగా ద్విబాషా చిత్రం చేయనున్న మెగా నిర్మాత
హైదరాబాద్: ఇటీవల విడుదలైన 'రేసు గుర్రం' చిత్రంతో భారీ విజయం అందుకున్న ప్రముఖ తెలుగు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మరో భారీ ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నారు. సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...'సూర్యతో ద్విబాషా చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం సూర్య, మురుగదాస్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రాజెక్టు ఫైనలైజ్ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను' అని తెలిపారు.
గతంలో సూర్య, మురుగదాస్ కాంబినేషన్లో 'గజిని', 'సెవెన్త్ సెన్స్' అనే రెండు సినిమాలు వచ్చాయి. 'గజినీ' చిత్రం భారీ విజయం సాధించగా...'సెవెన్త్ సెన్స్' చిత్రం నిరాశ పరిచింది. తాజాగా ఈ ఇద్దరు కలిసి మూడో సినిమా చేస్తుండటం చర్చనీయాంశం అయింది.
'రేసు గుర్రం' చిత్రం గురించి బుజ్జి మాట్లాడుతూ....సినిమా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. సురేందర్ రెడ్డితో త్వరలో మరో సినిమా చేస్తాను. ప్రస్తుతానికి స్క్రిప్టులు ఏవీ రెడీగా లేవు. స్క్రిప్టు ఓకే అయితే త్వరలోనే సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాను అని తెలిపారు.